ఎల్బీనగర్/ఆర్కేపురం, జూన్ 3 : వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ యార్డులో రైతులను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014-15 సంవత్సంలో వరి ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు ఆగ్రస్థానంలో ఉందన్నారు. ఉత్సాదకతలో దేశంలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక, రైతు శ్రేయస్సు పాలనకు ఇది నిదర్శనమన్నారు.
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, సాగర్రెడ్డి, ప్రవీణ్కుమార్, కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ పి.ఈశ్వరమ్మ యాదవ్, జక్కల శ్రీశైలం యాదవ్, చిరంజీవి, చెన్నగోని శ్రీధర్ గౌడ్, మహేశ్యాదవ్, నల్ల రఘుమారెడ్డి, వెంకటేశ్ గౌడ్, పెండ్యాల నాగేశ్, కొండల్రెడ్డి, మహేందర్యాదవ్, బొగ్గారపు వరుణ్చంద్ర, శ్వేతారెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి చిలుకా నర్సింహారెడ్డి, ఈవో స్రవంతి, రాజేశ్వరి, రైతులు పాల్గొన్నారు.