జూబ్లీహిల్స్ : మహిళలను గౌరవించే సంస్కృతి మనదని, తెలంగాణ నుంచి ఈ సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయనున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గురువారం రాత్రి రహ్మత్నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి మహిళా బంధు కేసీఆర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారిని గౌరవించిందన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చాటిచెబుతాయన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా షీ టీమ్స్ రక్షణ మహిళలకు అండగా ఉందని, ఇంకా అనేక రకాల కార్యక్రమాలతో మహిళలు ఆత్మస్తైర్యంతో అడుగులు వేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా బాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుటకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మహిళలందరికీ ప్రత్యేక బహుమానాలందించి పలువురు మహిళలను సత్కరించారు.