ఎల్బీనగర్ : భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి కొవిడ్ టీకాలు వేయిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం చైతన్యపురి, దిల్సుఖ్నగర్లోని కళాశాలలో విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 15 సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్రావుకు విన్నవించగానే అంగీకరించి సహాకారం అందించారన్నారు.
ప్రస్తుతం కళాశాలల్లో తొలి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తియి రెండవ విడుత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కొవిడ్ మహామ్మారిని పూర్తిగా తుదముట్టించేందుకు వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలన్నారు. అందుకోసం విద్యార్థులను వారి తల్లిదండ్రులు కూడా సన్నదం చేయాలన్నారు.
విద్యార్థులు ఎలాంటి బయాందోళనలకు గురి కాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్రెడ్డి, సుమంత్, సతీష్తో పాటుగా వివిధ కళాశాలల వారు పాల్గొన్నారు.