బన్సీలాల్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం భోలక్పూర్లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నత పాఠశాల సాధన కమిటి ప్రతినిథులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం పాఠశాలలో ఏడవ తరగతి వరకు ఉన్నదని, ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిద తరగతిని ప్రవేశపెట్టాలని, అలాగే అదనపు తరగతి గదులను నిర్మించాలని వారు కోరారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాక విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని, అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని వారు అన్నారు.
దానికి స్పందించిన మంత్రి తలసాని మాట్లాడుతూ సర్కారు బడులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘మన బస్తీ-మన బడి’ పథకం ప్రవేశ పెట్టిందని, అందులో భోలక్పూర్ పాఠశాలను కూడా చేర్చేలా విద్యాశాఖ మంత్రికి సిఫారసు చేస్తానని అన్నారు.
పాఠశాల హెచ్ఎం కే.మల్లిఖార్జున్ రెడ్డి, ఉన్నత పాఠశాల సాధన కమిటి కన్వీనర్ ఈ.చంద్రశేఖర్, కో-కన్వీనర్లు బి.నర్సింగ్రావు, విజే.శేషగిరిరావు, టీఆర్ఎస్ నాయకులు ఎం.ఎ.ఫహీమ్, ఎన్.ప్రేమ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు పాల్గొన్నారు.