బన్సీలాల్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గురువారం ఆయన బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, బల్దియా జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి బన్సీలాల్పేట్ డీ-క్లాస్ ప్రాంతంలో పర్యటించారు. రాత్రి వేళల్లో బస్తీలో తిరగాలంటే ఇబ్బందిగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయగా, వెంటనే అక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మంత్రి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
డ్రైనేజి పైప్లైన్ తదితర సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగ ఆయన వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ డీసీ ముకుందరెడ్డి, జలమండలి జీఎమ్ రమణారెడ్డి, సికింద్రాబాద్ మండల తహసిల్దార్ కె.బాలశంకర్, టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, కమల్కుమార్, ప్రేమ్కుమార్, జ్ఞాని, శ్రీనివాస్, అరుణ్గౌడ్, రాజేందర్, రంజిత్, సాయిబాబా, ఫహీమ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు పాల్గొన్నారు.