సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నగరంలో పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంజీరా ఫేజ్-2కు చెందిన కలబూర్గు-పటాన్చెరు ప్రధాన పైప్లైన్కు రుద్రారం సమీపంలో ఏర్పడిన భారీ లీకేజీ కారణంగా జలమండలి అధికారులు అత్యవసర మరమ్మతు పనులు చేపట్టడంతో నగరంలో శుక్రవారం పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. అంతరాయం కలిగిన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలు..
మియాపూర్:ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మియాపూర్.
కూకట్పల్లి, కేపీహెచ్బీ: కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్
అమీర్పేట్: ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్
ఇతర ప్రాంతాలు: బీరంగూడ, అమీన్పూర్, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లకు కూడా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు.