నగరంతోపాటు శివార్లకు నీటి సరఫరా
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
బడంగ్పేట/పహాడీషరీఫ్, ఏప్రిల్ 6 : ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను అమలు చేస్తున్నారని, ఈ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య చాలావరకు తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ సాయిసామ్రాట్ కాలనీ, టీఎంఆర్ కాలనీ, టీకేఆర్ కళాశాల వద్ద, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బిస్మిల్లాకాలనీలో తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులకు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక్కరోజులోనే రూ.371 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.
భవిష్యత్లో నీటి సమస్య రాకుండా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని, ఔటర్ లోపల పట్టణాల్లో ఇప్పటికే పనులు మొదలయ్యాయని చెప్పారు. శివార్ల తాగునీటి అవసరాలు తీర్చటానికి సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లు కేటాయిస్తే జల్పల్లి మున్సిపాలిటీకి మొదటిదశలో రూ.45 కోట్లు, రెండోదశలో రూ.73 కోట్లు కేటాయించా రన్నారు. ఆయా కార్యక్రమాల్లో మీర్పేట మేయర్,డిప్యూటీ మేయర్లు దుర్గా దీప్లాల్ చౌహాన్, తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, కార్పొరేటర్లు, జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ఇక్భాల్ బిన్ ఖలీఫా, టీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ పటేల్, షేక్ అప్జల్, మన్సూర్అలీ, అధికారులు పాల్గొన్నారు.