సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.16.43 లక్షల నగదుతోపాటు రూ.10,250 విలువజేసే ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ తెలిపారు. జిల్లాలో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఇప్పటి వరకు రూ.17,25,311 విలువజేసే వస్తువులను పట్టుకున్నట్లు తెలిపారు. 54.67 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకోగా.. 8 మందిపై ప్రొహిబిషన్ కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
లష్కర్లో రూ.20 లక్షలు..
బేగంపేట: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర మండలం, మహం కాళి, మార్కెట్ పోలీసులు కలిసి మంగళవారం రాత్రి టుబాకో బజార్, పాట్మార్కెట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అజంతా స్వీట్హౌజ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రాజస్థాన్కు చెందిన రమేశ్ వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, 120 గ్రాముల నల్లమందును, ప్యాట్నీ సెంటర్లో ఓ కారును తనిఖీ చేసిన పోలీసులు.. రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
రాజేంద్రనగర్లో..
బండ్లగూడ: బైక్పై వెళ్తున్న యాదగిరి తనిఖీ చేసి వద్ద నుంచి రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
రూ.25 లక్షల నగదు పట్టివేత..
సుల్తాన్బజార్: ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ.25లక్షల నగదును సుల్తాన్బజార్ పోలీసులు అనూప్ సోని నుంచి స్వాధీనం చేసుకున్నారు.