వరలక్ష్మీ వత్రం సందర్భంగా శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు దేవాలయాలకు తరలివెళ్లి వ్రతాలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని రంగురంగుల గాజులతో అందంగా అలంకరించిన దృశ్యమిది.
బేగంపేట్ ఆగస్టు 25: శ్రావణ వరలక్ష్మీ వ్రతాల పూజలను పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ అధికారులు అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులు ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు చేశారు. ఆలయ ఈవో గుత్తా మనోహార్రెడ్డి భక్తులకు ఏర్పాట్లు చేశారు.అమ్మవారికి ఐదు వారాల పాటు సాక సమర్పించాలని భవిష్యవాణి చెప్పడంతో చివరి ఐదో శుక్రవారం భక్తులు అమ్మవారికి సాక సమర్పించారు.