గాజులరామారం/కుత్బుల్లాపూర్, జనవరి 11: స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్రాజులు అన్నారు. బుధవారం వడ్డె ఓబన్న జయంతి వేడుకల సందర్భంగా జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మహాలక్ష్మినగర్లో అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు వేర్వేరుగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి.. ఓబన్న పోరాటస్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, జాతీయ మ హిళా అధ్యక్షురాలు తిరుమలాదేవి, పార్టీ ఆయా డివిజన్ల అధ్యక్షులు అశోక్, భాస్కర్, సీనియర్ నాయకులు, వడ్డేర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
కొంపల్లిలో…
వడ్డేర సంఘం కొంపల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాఖ నూతన కమిటీని ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్తో పాటు మాజీ ఎంపీపీ సన్న కవితలను వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహేశ్, ఉపాధ్యక్షు డు సంపంగి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఆలకుంట యాకన్న, కొమ్మరాజుల కృష్ణంరాజు, రాజుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.