మెహిదీపట్నం, డిసెంబర్ 17 : మెదడు వాపు వ్యాధి రాకుండా సంవత్సరం నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు జె.ఈ. వ్యాక్సిన్, మీసిల్స్ అండ్ రుబెల్లా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వ తేదీ ( 2023 )వరకు వ్యాక్సిన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం గోల్కొండ ఏరియా దవాఖానలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్యాంపెయిన్ కోసం రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే , నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అనూరాధ, సూపరింటెండెంట్ డాక్టర్ మహ్మద్ మజహరుల్లా, డిప్యూటీ ఐఓఎస్ అనూరాధలతో కలిసి ఆవిష్కరించారు.