నగర పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి.. వారి జాబితాను సిద్ధం చేయాలని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఈ మేరకు మంగళవారం డీసీపీలు, ఏసీపీలు, స్టేషన్ ఎస్హెచ్ఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సీపీ మాట్లాడారు. ప్రతి ఏసీపీ, డీసీపీలు… వారి పరిధిలోని సిబ్బందికి పాజిటివ్ వస్తే వారితో మాట్లాడుతూ ధైర్యం చెబుతూ.. వారికి అండగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సినేషన్ చేయించాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అందుకు వారి జాబితాను త యారు చేయాలని అన్నారు. అలాగే.. కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి.. వాటిపై పర్యవేక్షణ ఎలా ఉంది.. అని ఆరా తీశారు. 2018 నుంచి చైన్ స్నాచింగ్లు, రౌడీషీటర్లకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా సీపీ చర్చించారు. సమావేశంలో అదనపు సీపీలు శిఖాగోయెల్, అనిల్కుమార్, చౌహాన్ , అధికారులు పాల్గొన్నారు.