సిటీబ్యూరో, జనవరి 30(నమస్తే తెలంగాణ) : అమెరికా కాన్సులేట్కు చెందిన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలను వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడకు కాన్సులేట్ కార్యాలయాన్ని గతేడాదిలో మార్చారు. ఈ క్రమంలో పాత కార్యాలయంలో ఉన్న వస్తువులను అర్హత కలిగిన గుత్తేదారులకు విక్రయించేందుకు నోటీసులను జారీ చేశారు.
31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించగా.. నిర్ణీత మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ వేలంలో యూఎస్ కాన్సులేట్ అధికారులు పేర్కొన్న వస్తువులను లాట్ ప్రాతిపదికన విక్రయించనున్నారు. వివరాలకు https:// www.accurateauctioneers.in సంప్రదించాలన్నారు.