మన్సూరాబాద్ : నిరుపేద కుటుంబాలలో జరుగుతున్న పెండ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. వనపర్తి జిల్లా, ఖిల్లా ఘనపురంకు చెందిన తిమ్మాపురం కుర్మయ్య, పార్వతమ్మ దంపతుల కుమార్తె దివ్యాంగురాలైన బాలసూర్య వివాహం, నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్, తిరుమలగిరి మండలం, సుంకిశాల గ్రామానికి చెందిన నూన్సావత్ లక్ష్మీ, మంగ్త కూతురు శిల్ప వివాహం ఇటీవల నిశ్చయమైంది.
ఇరువురి కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కొందరు సన్నిహితుల ద్వార తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వెంటనే స్పందించి ఉప్పల ఫౌండేషన్ ద్వార ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
నాగోల్ డివిజన్ కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు కుటుంబాలలో జరుగుతున్న వివాహాలకు గాను పుస్తె, మట్టెలు, చీర, గాజులతో పాటు 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలసూర్య, వెల్దండి సదానందం, బి. సాగర్, విష్ణుప్రియ, రామకృష్ణ, రవీందర్, సక్రు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.