మన్సూరాబాద్, ఆగస్టు 22 : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. ఉప్పుగూడ, హనుమాన్నగర్కు చెందిన కునుతూరు బ్రహ్మచారి, అరుణ జ్యోతి దంపతుల కుమార్తె వైష్ణవి వివాహం ఇటీవల నిశ్చయమైంది. నిరు పేదలైన బ్రహ్మచారి, అరుణ జ్యోతి దంపతుల ఆర్థిక పరిస్థితిపై కొందరు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త నిరుపేద కుటుంబంలో జరుగుతున్న వివాహానికి తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.
ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్లోని తన నివాసంలో వైష్ణవి వివాహానికి గాను పుస్తె, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా ఆమెతో పాటు వచ్చిన కుటుంబసభ్యులకు తెలంగాణ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్పర్సన్ ఉప్పల స్వప్న అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తున్నామని తెలిపారు.