ఉప్పల్, జూలై 8 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చేపడుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. మీకు ఏ సమస్యలున్నా.. నేనున్నానంటూ.. భరోసానిస్తూ ముందు కు సాగుతున్నారు. సమస్యలను శ్రద్ధగా వింటూ.. అధికారులకు సూచనలు చేస్తూ.. అక్కడికక్కడే పరిష్కార చర్య లు చేపడుతున్నారు. దీంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేసిన పనులను సైతం పరిష్కరించేదిశగా ప్రణాళికలు సిద్ధం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రలో భాగంగా శనివారం చిలుకానగర్ డివిజన్లోని బీరప్పగడ్డ, అన్నపూర్ణకాలనీ, న్యూప్రశాంత్నగర్, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ..కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు, మ్యాన్హాల్స్, నాలాల ఆధునీకరణ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మంచినీటి స మస్యలు, లీకేజీలపై ఫిర్యాదులు గుర్తించారు. సం బంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టాల ని ఆదేశించారు. అనంతరం బీరప్పగడ్డ వాటర్ట్యాంక్ ఆవరణలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్ర జల నుంచి వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు.
భారీగా తరలివచ్చిన కాలనీవాసులు, నేతలు
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు కాలనీవాసులు, నేతలు భారీగా తరలివచ్చారు. కాలనీవా సు లతో కలిసి నడుస్తూ ఫిర్యాదులు స్వీకరించారు. సమస్య లు వింటూ, అధికారులకు ఆదేశాలు ఇస్తూ.. ముందుకు సాగారు. కాలనీవాసులు, నేతలు స్వచ్ఛందగా తరలివచ్చి, తమ మద్దతును తెలియజేస్తున్నారు.
సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ…
కాలనీల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు పలువురు కాలనీవాసులు సమస్యలను తెలియజేస్తున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను శ్రద్ధగా వింటూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అదేవిధంగా కాలనీవాసులను ఇం టింటికి వెళ్లి పలకరిస్తూ.. సమస్యలను అడిగి తెలుసు కుంటున్నారు. సమస్యలను పరిష్కరించేవిధంగా చూస్తామని హామీస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్బీకాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్రెడ్డి, సిం గిరెడ్డి ధన్పాల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, ప్రధాన కార్యదర్శి కొకొండ జగన్, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గుడి మధుసూదన్రెడ్డి, భాస్కర్, జెల్లి మోహ న్, పిట్టల నరేశ్ ముదిరాజ్, పండ్ల కిషన్, ఈరెల్లి రవీందర్రెడ్డి, కొంపెల్లి రవీందర్, రాజ్కుమార్, కొండల్రెడ్డి, ఐకాన్ మోహన్రెడ్డి, బింగి శ్రీను, ఇర్షాద్ ఖాన్, వేముల సంతోష్రెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, డప్పు గిరిబాబు, మేకల ముత్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.