ఉప్పల్, మార్చి 27 : ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలు తెలిసిన సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేవిధంగా పథకాలు తీసుకువచ్చారన్నారు. మేలు చేసిన వారిని ఎప్పటికీ మరవద్దని సూచించారు.
తెలంగాణ సాధించడంలో చూపిన చిత్తశుద్ధిని తెలంగాణ అభివృద్ధిలోనూ కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసేవారికి ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. అర్హులైన వారిని గుర్తించి, వారికి ప్రజాసంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజ ల సమస్యలే ప్రధాన ఎజెండాగా నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అర్హులైన ఉప్పల్ మండలానికి చెందిన 81 మంది లబ్ధిదారులకు చెక్కులను అం దజేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ గౌతమ్కుమార్, డిప్యూటీ తాసీల్దార్ రఫీఉద్దీన్, కార్పొరేటర్లు శాంతిసాయిజెన్శేఖర్, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, పన్నాల దేవేందర్ రెడ్డి, బండారు శ్రీవాణి, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, పల్లా కిరణ్కుమార్రెడ్డి, వేముల సంతోష్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి పాల్గొన్నారు.