మల్లాపూర్, ఫిబ్రవరి 10 : నాచారం దుర్గానగర్కు చెందిన ఆటో డ్రైవర్ నిమ్మగళ్ల నరేశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి నరేశ్ కుటుంబాన్ని పరామర్శించారు.
అతడి తల్లిదండ్రులు నిమ్మగళ్ల గోపాల్, జ్యోతిలకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, నాయకులు జె.భాస్కర్, శ్రీనివాస్, పొన్నాల మహేందర్, మూర్తి రాజు, కె.అంజి, దొంతుల శ్రీనివాస్, భూపతి అశోక్ తదితరులు ఉన్నారు.