ఉప్పల్, జనవరి 25 : ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం రామంతాపూర్ డివిజన్లోని ప్రగతినగర్, ఓల్డ్ రామంతాపూర్ కాలనీలలో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో ఉప్పల్ ని యోజకవర్గం ఆదర్శంగా ఉండేలా కృషి చేస్తున్నామని అ న్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణివెంకట్రావు, డీఈ నాగమణి, అధికారులు రాములు, సూర్యనారాయణ, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, తిప్పని సంపత్, సూరం శంకర్, మధు, విజయ్, స్వప్న, వెంకటేశ్వర్రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఉప్పల్, భరత్నగర్కాలనీలో బుధవారం అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ మందుముళ్ల రజితాపరమేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, సంతోష్రెడ్డి, మస్క సుధాకర్, స్వీట్హౌజ్ రాజు, వెంకట్రావు, టంటం వీరేశ్, వెంకట్రెడ్డి, అన్య వెంకటేశ్, నరేందర్, ప్రభాకర్, శ్రీకాంత్, మల్లేష్శ్ పాల్గొన్నారు.