సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసం.. రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేస్తున్నది. విపక్ష పార్టీల్లో ఒకే పార్టీలో ఉన్న నాయకులు గ్రూప్ రాజకీయాలు చేస్తుండగా, కారు పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ప్రత్యర్థులుగా గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు నేడు ఒకే కారులో కనిపిస్తున్నారు. హ్యాట్రిక్ సర్కారే లక్ష్యంగా ఎన్నికల ప్రచార పర్వంలో బిజీ బిజీ అయ్యారు. కారు గుర్తుకు ఓటేయాలని కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి మద్దతు పలికారు. లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సోమవారం తన నివాసంలో ప్రకటించారు.
ఉప్పల్, నవంబర్ 6 : రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డిని గెలిపిస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తో తనకు తండ్రీకొడుకుల అనుబంధం ఉందని తెలిపారు. పార్టీని వీడే ప్రసక్తేలేదని, నా జీవితం ఉన్నంతకాలం బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ బీఆర్ఎస్పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీతో 23 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. తనను కడుపులో పెట్టుకొని ఒక తండ్రిలా కాపాడిన సీఎం కేసీఆర్తోనే తన పయనమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా పనిచేస్తూ, బీఎల్ఆర్ను గెలిపించుకుంటామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మాట దాటనని, ఒక వృక్షంలా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీని ఉప్పల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉప్పల్ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేశానని, రానున్న రోజుల్లో ఉప్పల్కు మహర్దశ వస్తుందన్నారు.
అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం
బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఉప్పల్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. ఉప్పల్లో ఎమ్మెల్యే సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. ఉప్పల్లో పలు రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ఐటీ, పరిశ్రమలు, తదితర రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు. సాధ్యం కాని హామీలను ఇస్తున్న ప్రతిపక్షాలను నమ్మవద్దని తెలిపారు.
ఓ కుటుంబంలా కలిసి పని చేస్తాం
పాటు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల తో కుటుంబంలా కలిసి పనిచేస్తామని అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కార్యకర్తలను అందరిని కలుపుకొని పోతామన్నారు. గత ఎన్నికల్లో సుభాష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశానని, ఈ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
కొడంగల్లో రేవంత్కు ఓటమి తప్పదు : రాగిడి లక్ష్మారెడ్డి
రేవంత్రెడ్డి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని, కొడంగల్లో ఆయనకు ఓటమి తప్పదని బీఆర్ఎస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ చీకటి ఒప్పందాలను ప్రజలు గుర్తించాలన్నారు. బండారి సేవలను గుర్తించి, ఓటు వేయాలని కోరారు. గ్రేటర్లో మంత్రి కేటీఆర్ కృషి గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్, సాయిజెన్ శేఖర్, బేతి స్వప్నారెడ్డి, పావనీరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి, రఘుపతిరెడ్డి, రవీందర్రెడ్డి, సుధాకర్, శైలేశ్ రెడ్డి, పాల్గొన్నారు.