చర్లపల్లి (హైదరాబాద్) : నగరంలోని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి (Bandari Laxmareddy) కి కాపు కులాల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఏఎస్రావునగర్ డివిజన్ కమలానగర్లోని కాపు సంఘం భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, కాపు కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాపు కులస్థుల సమావేశానికి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. కాపులకు హైటెక్సిటీ వద్ద ఏడు ఎకరాల స్థలాన్ని, కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే రూ.40కోట్ల నిధులు కేటాయించడంతో పాటు వంద పడకల వైద్యశాల, డిగ్రీ, జూనియర్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని వివరించారు.
బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమం, ఎన్నికల మెనిఫెస్టోకు ఆకర్షితులై కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావనీమణిపాల్రెడ్డి, కాపు కులాల ఐక్యవేదిక అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్రావు, ప్రసాద్లు మాట్లాడారు. కాపు కులాల ఐక్యవేదిక నాయకులు దేవరకొండ శ్రీనివాస్, నాగు, ఏవీఆర్.దత్తు, శంకర్బాబు, నాగన్న, మధుసూదన్, లక్ష్మినారాయణలతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.