ఉప్పల్, డిసెంబర్ 10 : ప్రజా సంక్షేమానికి తగిన చేయూతనందిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్లోని తాసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసాయం పెంపు పథకాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యసాయం అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వైద్యసేవలకు సహాయం అందించడానికి తాను ముం దుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మనోహార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ నారాయణరావు, కార్పొరేటర్లు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, బండారు శ్రీవాణి, దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ అంజయ్య పాల్గొన్నారు.
మల్కాజిగిరి, డిసెంబర్ 10: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరిలోని జిల్లా ఏరియా దవాఖానలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందజేయడానికి మౌలిక సదుపాయా లు కల్పిస్తామని అన్నారు.
ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువగా ఉండడానికి బస్తీల్లో మరిన్ని బస్తీ దవాఖానలు ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే ఉన్న బస్తీ దవాఖానల్లో మరిన్ని సేవలను విస్తరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ ప్రసాద్, తాసీల్దార్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు శ్రవణ్, మేకల సునీతారాము యాదవ్, క్యానం రాజ్యలక్ష్మి, సునీతాచంద్రశేఖర్ యాదవ్, మురుగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.