ఉప్పల్, నవంబర్ 30 : అభివృద్ధి, సంక్షేమంలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్లోని సౌత్స్వరూప్నగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల సమగ్రాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి నిధులు తీసుకువస్తున్నామని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
సీసీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో కాలనీ సంక్షేమ సంఘాలు భాగస్వామ్యం కావాలన్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతో ష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మస్క సుధాకర్, చింతల నర్సింహారెడ్డి, అరిటికాయల వంశీ, ఐలేశ్, కాలనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.