సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ కార్యకలాపాలు నిర్వహించడంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ముందంజలో ఉందని మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగా యూటీఎస్ మొబైల్ యాప్, ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషిన్లు, పాయింట్ ఆఫ్ సేల్ మిషిన్లతో పాటు యూపీఐ చెల్లింపులు వంటి వాటిని ఎస్సీఆర్ ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ మేరకు జోన్ పరిధిలోని అన్ని ముఖ్యమైన నాన్-సబర్బన్ స్టేషన్లు, 1-4, సబ్-అర్బన్ క్యాటగిరి స్టేషన్లలోని అన్ని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్ కౌంటర్లలోని పీవోఎస్తో పాటు యూపీఐ చెల్లింపుల విధానాన్ని ఏర్పాటు చేసింది.