మున్సిపాలిటీలో రోడ్లు, మురికి కాలువలు లేని కాలనీలు గుర్తిస్తాం. నిధులు మంజూరు కాగానే ఆ కాలనీల్లో మురికి కాలువలు,రోడ్ల వేయిస్తాం. మున్సిపల్ పరిధిలోని 18 వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.
– స్వామి, కమిషనర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీ
మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 21: కాలనీలు ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడ 4వ వార్డులోని పలు కాలనీల్లో ఇండ్లు నిర్మించుకొని 12 నుంచి 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా కనీస వసతులైన రోడ్లు, మురికి కాలువలు లేవు. ఈ కాలనీల్లో సీసీ, బీటీ రోడ్లు లేక మట్టి రోడ్లతో ప్రతి రోజూ దుమ్ము, దూళితో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో మురికి కాలువలు, రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని పలు కాలనీల ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక నిధులతో ప్రతి కాలనీలో రోడ్లు, మురికి కాలువులు నిర్మించి స్థానికుల ఇబ్బందులు తొలగించాలని కాలనీల వాసులు అధికారులను వేడుకుంటున్నారు.