హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. మహిళకు 35 – 36 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఎయిర్పోర్టు పోలీసులు (RGI Police) దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీంను రప్పించారు. శంషాబాద్ అదనపు డీసీపీ ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.