ఇదో కొత్త తరహా మోసం ! ఇల్లు కిరాయి తీసుకుంటానని నమ్మించి తెలివిగా.. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్న ఓ వ్యక్తి.. ఇంటి యజమాని నుంచి రూ.78వేల నగదు కొట్టేశాడు. దీంతో మోసపోయిన ఇంటి ఓనర్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.3లో నివాసం ఉంటున్న అర్చనా ఖండేల్వాల్ ముంబయిలోని ఫ్లాట్ను అద్దెకు ఇస్తానని ఆన్లైన్లో ప్రకటన ఇచ్చింది. ఈ నెల 7న గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి.. తన పేరు అనిల్ కుమార్ అని ఆర్మీలో పని చేస్తానంటూ పరిచయం చేసుకున్నాడు. ఫ్లాట్ అద్దెకు తీసుకుంటానని, అడ్వాన్స్గా గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తానని నమ్మించాడు. బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఆమె ఖాతా నుంచి రూ.78,500 విత్డ్రా చేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.