మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
బంజారాహిల్స్,జూన్ 13: ఎన్నటికీ సాధ్యంకాదనే విషయం తెలిసినా ఎస్సీ వర్గీకరణ అంశంపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దళితుల మధ్యన విభజన తెచ్చే వర్గీకరణను దేశంలోని మెజార్టీ రాష్ర్టాలు అంగీకరించడం లేదన్నారు.
రాజకీయాల కోసం మాలమాదిగల మధ్యన చిచ్చుపెట్టేలా ప్రకటనలు చేస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరుమార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.