హైదరాబాద్ : డీసీఎం వ్యాన్(DCM van,) డీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి(Killed) చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం(Pocharam) ఐటీసీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ బి. రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసు స్టేషన్ పరిధి వెంకటాపూర్ రోడ్డు అనురాగ్ యూనివర్శిటీ సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియ రాలేదని, ఎవరికైనా తెలిస్తే పోచారం ఐటీసీ పోలీసు (87126 62718)లను సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.