మారేడ్పల్లి, మార్చి 31 : రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా అటు నుంచి వెళ్తున్న ఓ రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు సూమారు 30-35 సంవత్సరాలు ఉంటాయని, ఒంటి పై నలుపు రంగు పుట్ హాండ్స్ చొక్కా, క్రీమ్ కలర్ ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులు ఏవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.