రామంతాపూర్/మల్లాపూర్,ఏప్రిల్ 2 : ఉప్పల్ నియోజకవర్గంలో శుభకృత్ నామ తెలుగు నూతన సం వత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలు సందడిగా మారా యి. పురోహితులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. పలు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి చేసి.. పంచిపెట్టారు.
రామంతాపూర్లోని సత్యనారాయణ స్వామి , మల్లికార్జునస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. శ్రీనివాస్పురంలోని కోదండరామాలయంలో ఆలయ పూ జారులు అనిల్ , కిరణ్ శర్మలు పంచాంగ శ్రవణం చేశారు.
డివిజన్ పరిధిలోని నందీశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి పాండురంగా చార్యులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీహరిగౌడ్, సుదర్శన్, పీఆర్ నాగరాజు, హమాలీ శ్రీనివాస్, అనంతరాం, కృష్ణ, రాంపల్లి శివకుమార్గౌడ్, శ్రవణ్ పాల్గొన్నారు.