సుల్తాన్బజార్, నవంబర్ 16 : నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం కళాశాలలో గర్ల్స్ హాస్టల్ వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించారు. విద్యార్థుల పోరాటం ఫలించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.