కీసర, మార్చి 11: భర్తను హత్యచేసిన కేసులో భార్యతోపాటు మరొకరికి జడ్జి జీవితఖైదు విధించారు. వివరాల్లోకి వెళ్తే.. కీసర పోలీస్స్టేషన్ పరిధి, ఆర్జీకే కాలనీలో బెరా రేణుక (37), బెరా వసంత్ దంపతులు నివాసం ఉండేవారు. 2019 మార్చి 13న రేణుక తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు దేవగాడ కిశోర్ (30)తో కలిసి భర్తకు మద్యం తాగించి చేతులు కట్టి, చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్చేసి కోర్టుకు తరలించారు. సాక్షాధారాల ఆధారంగా కోర్టు ఆ ఇద్దరిని దోషులుగా తేల్చి.. జీవితఖైదు విధించింది.