హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణం జరిగింది. నగరంలో వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులు దారుణ హత్యకు గురయ్యారు. హబీబ్నగర్, నాంపల్లి పరిధిలో ఇద్దరు యాచకుల తలపై రాళ్లతో మోది హత్య చేశారు. ఈ రెండు హత్యలను ఒకరే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసులను దర్యాప్తు చేస్తున్నారు.