దుండిగల్, ఫిబ్రవరి 11: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. షాపూర్నగర్ నివాసి శివకుమార్ (33) అత్తాపూర్లోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి కాలేజీ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో ఆగివున్న ఆటో ట్రాలీని వెనుక నుంచి ఢీ కొన్నాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బాచుపల్లి శ్రీసాయినగర్ నివాసి కామేశ్వర్ రావు(54) శనివారం రాత్రి సమీపంలో ఉన్న కిరాణా దుకాణానికి బైక్పై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా బైక్ అదుపు తప్పి గోడను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. దీంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.