Road Accident | రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటున్నది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న సమయంలో కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
డ్రైవర్తో పాటు మరో మహిళ మృతి చెందింది. మృతులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు. ప్రమాదం సమయంలో కారు వేగంగా ఉండడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్రేన్ సహాయంతో కారును వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.