హైదరాబాద్: హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో (KPHB) ఉన్న ఫోరం మాల్ సర్కిల్లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది (Accident). దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే యాగ్జిడెంట్కు కారణమని చెప్పారు.
కారు అగ్రజ్ రెడ్డి అనే వ్యక్తికి చెందినది గుర్తించామన్నారు. ప్రమాద సమయంలో అతనితోపాటు మరో ఇద్దరు కూడా కారులో ఉన్నారని చెప్పారు. గచ్చిబౌలిలోని ఓ పబ్లో పార్టీ చేసుకున్న అగ్రజ్ రెడ్డి.. తన స్నేహితులు కార్తీక్, తేజతో కలిసి కారులో బయలుదేరారని, మద్యం మత్తులో కారును రాంగ్ రూట్లో పోనివ్వడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. కాగా, అగ్రజ్కు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించగా.. ఆల్కహాల్ 90శాతం నమోదైనట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడినవారిని రాజస్థాన్ చెందిన కార్మికులు దూర్ చంద్, బాన్వర్ లాల్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు్న్నారు.