హైదరాబాద్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఓ టయోటా కారు, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేసి మొహ్మద్ ఖాదీర్(26), మొహ్మద్ ముజీబ్(31)ను పట్టుకున్నారు. వీరి సహాయకుడు మొహ్మద్ అజీజ్ పరారీలో ఉన్నాడు. నిందితులను ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో అప్పగించారు.