Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. చాంద్రయాణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిచిన ఆటోలో మృతదేహాలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు.
ఆటోలో యువకుల మృతదేహాలు కనిపించడంతో కంగారుపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతులను మహమ్మద్ జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. ఘటనాస్థలంలో డ్రగ్స్ ఇంజెక్షన్లను గమనించారు. దీంతో స్టెరాయిడ్స్ ఓవర్ డోస్లో తీసుకోవడం వల్లనే వీరు మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
పాతబస్తీలో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం
డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తున్న పోలీసులు
హైదరాబాద్ – చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిచి ఉన్న ఆటోలో ఇర్ఫాన్, మహమ్మద్ జహంగీర్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
ఘటనా స్థలంలో డ్రగ్స్… pic.twitter.com/oL7cfxBQKI
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025