సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పార్కు చేసిన ద్విచక్రవాహనాలను(Bikes) అపహరిస్తున్న( thieves) ఇద్దరు స్నేహితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ నితికా పంత్ కథనం ప్రకారం.. జియగూడలో నివాసముండే కొంచం కోటి అలియాస్ ఈశ్వర్ పాత నేరస్థుడు, ఇతనిపై గతంలో 13 కేసులున్నాయి. కాగా, అదే ప్రాంతంలో నివాసముండే బైక్ మెకానిక్ ఎండీ యూసుఫ్కు స్నేహితుడిగా మారాడు. ఇద్దరు రాత్రి పొద్దుపోయిన తరువాత రోడ్లపై తిరుగుతూ పార్కు చేసిన బైక్లను అపహరిస్తూ వాటిని సెకెండ్ హ్యాండ్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
యూసుఫ్ మెకానిక్ కావడంతో బైక్లను సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో ఈజీగా విక్రయిస్తున్నారు. ఇటీవల మాసబ్ట్యాంక్, గుడిమల్కాపూర్ ఠాణాల పరిధిలో రెండు బైక్లో చోరీ కావడంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజునాయక్ బృందం ఇద్దరు బైక్ దొంగలను పట్టి, వారి వద్ద నుంచి మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను మాసబ్ట్యాంక్ పోలీసులకు అప్పగించారు.