సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేసి, మెరుగైన పనితీరును కనబర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ( టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూకీ సూచించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని సోమవారం సంస్థ డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాలకు అనుకూలంగా ఉద్యోగులు పనిచేస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ టి.శ్రీనివాస్, కె.రాములు, సీహెచ్. మదన్మోహన్రావు, జి.పర్వతం, ఎస్.స్వామి రెడ్డి, సీజీఎంలు, ఎస్ఈలు, పలువురు యూనియన్, అసోసియేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.