సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కొత్తగా 411 బస్ షెల్టర్లు నిర్మించాలని బల్దియా నిర్ణయించింది. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఏడాది వ్యవధిలో అత్యాధునిక బస్ షెల్టర్లను నిర్మించి.. అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
బీవోటీ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు సంబంధించి.. రవాణా విభాగం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. బస్షెల్టర్ నిర్మించే ఏజెన్సీ..వాటిపై 15 ఏండ్ల పాటు ప్రకటనల ద్వారా ఆదాయం పొందవచ్చు.