హైదరాబాద్ : ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగబోయే క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్, హకీంపేట్, జీడిమెట్ల, ఘట్కేసర్, కోఠి, మోహిదీపట్నం, పటాన్చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ సౌకర్యాన్ని క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకోవాలని సూచించారు.