TSRTC | క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్! హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 బస్సులను నడపనున్నారు.
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. తిరిగి సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియం నుంచి బయల్దేరతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని క్రికెట్ అభిమానులు మ్యాచ్ వీక్షించాలని టీఎస్ఆర్టీసీ కోరింది.
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల వివరాలు :