TSRTC | విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. జేబీఎస్ నుంచి విజయవాడకు బస్సులు నడిపించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వెళ్లే 24 సర్వీసులను ఇకపై ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఈ సర్వీసులు కేపీహెచ్బీ కాలనీ, బాలానగర్, బోయిన్పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్ ), హబ్సీగూడ (పుష్పక్ పాయింట్ ), ఉప్పల్ (పుష్పక్ పాయింట్ ), ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు వెళ్తాయి.
అక్టోబర్ 18 నుంచే ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. పైగా జేబీఎస్ మీదుగా వెళ్లే బస్సుల టికెట్ ధరల్లోనూ ఎలాంటి మార్పు ఉండదు. ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే చార్జీలు ఉంటాయి. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్సైట్ సంప్రదించవచ్చు.