Route Pass | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ24, టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట ప్రత్యేకంగా రాయితీ కల్పిస్తున్నది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల కోసం తొలిసారిగా ‘జనరల్ రూట్పాస్’లను తీసుకువచ్చింది. ఈ పాస్లను ఈ నెల 27 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. నెల రోజుల పాటు చెల్లుబాటయ్యే సిటీ ఆర్డినరి రూట్ బస్పాస్కు రూ.600, మెట్రో ఎక్స్ప్రెస్ రూట్పాస్కు రూ.1000 ధరను ఆర్టీసీ నిర్ణయించింది. పాస్తో పాటై ఐడీకార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అయితే, మొదట హైదరాబాద్లోని 162 రూట్లలో ఈ పాస్లను జారీ చేయనున్నది. ఈ రూట్పాస్తో ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ప్రయాణికులు ఎన్నిసార్లైనా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ముఖ్యంగా సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ రూట్పాస్తో సాఫీగా ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఆర్డినరి బస్పాస్కు రూ.1150, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర రూ.1300గా ఉంది. ఈ పాస్ ఉన్న వారు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ప్రయాణం చేయవచ్చు.
సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్లు తీసుకుంటున్నట్లుగా ఆర్టీసీ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని గుర్తించిన సంస్థ.. వారిని దృష్టిలో పెట్టుకొని జనరల్ రూట్పాస్కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం హైదరాబాద్లో జనరల్ మెట్రో పాస్లు 1.30లక్షలు, ఆర్డినరి పాస్లు 40వేల వరకు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన జనరల్ రూట్పాస్లను ప్రయాణికులు ఆదరించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ కోరారు. వివరాల కోసం tsrtc.telangana.gov.in, online.tsrtcpass.in వెబ్సైట్లలో సంప్రదించాలని కోరారు.