హైదరాబాద్ : తెలంగాణ పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో మొత్తం 17,291 పోస్టులకు, గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా 503 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు కోచింగ్ తీసుకునేందుకు గ్రామాలు, పట్టణాల నుంచి రాజధాని హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగార్థుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో కోచింగ్ తీసుకునే వారి కోసం బస్ పాసుల్లో 20 శాతం రాయితీ కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఉద్యోగార్థుల కోసం జీబీటీ ఆర్డినరీ, జీబీటీ మెట్రో ఎక్స్ప్రెస్ పాసులపై ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. జీబీటీ ఆర్డినరీ పాసును రూ. 2,800లకు, జీబీటీ మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ను రూ. 3,200లకు అందించనున్నారు.
శనివారం(ఏప్రిల్ 30) నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని బస్ పాస్ కేంద్రాల్లో ఈ పాస్లు తీసుకోవచ్చు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే బస్ పాస్ పొందాలనుకునే వారు ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డుతో పాటు కోచింగ్ సెంటర్ ఐడీ కార్డును జతపరిచి, కౌంటర్లో దాఖలు చేస్తే, క్షణాల్లోనే బస్పాస్ పొందొచ్చు.
TSRTC is happy to announce 2 new bus passes for the unemployed youth attending training classes for competitive exams in #Telangana with a discount of 20%. #TSRTC wishes you all the very best and bright future ahead @TSRTCHQ @baraju_SuperHit @TV9Telugu @sakshinews#TSRTCNewPass pic.twitter.com/DQUfiRmlpl
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 30, 2022