TSRTC | ఆర్టీసీ కార్మికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను ఆర్టీసీ చెల్లించనుంది.
క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని.. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.