సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (సూపర్ వైజర్) భర్తీ కోసం ఈ నెల 8న నిర్వహించనున్న రాత పరీక్షకు జిల్లాలో 11,755 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు డీఆర్వో సూర్యలత తెలిపారు.
శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, ఎస్ఎల్డీసీ యూఎల్సీ కుమారి, ఎస్ఎల్డీసీ ఎల్సీ సంతోషి, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, డీసీపీ బాబురావు, జీహెచ్ఎంసీ నుంచి భాస్కర్, ఎలక్ట్రిసిటీ శాఖ నుంచి సీజీఎం ప్రార్థన, తదితర అధికారులు పాల్గొన్నారు.