సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఎండ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసి చల్లని కబురొచ్చింది. బుధవారం రాత్రి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. బీహెచ్ఈఎల్లో
అత్యధికంగా 3.6 సెం.మీలు, బంజారాహిల్స్, హైదరాబాద్ యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
మరో రెండు రోజులు కూడా వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రుతుపవనాల రాకపై గురువారం స్పష్టత రానున్నట్లు వాతావరణ కేంద్రం అధికారి ఎల్.వి.రావు తెలిపారు.